టీడీపీ మాజీ మంత్రి బీజేపీలో చేరిక…

కడప జిల్లాకి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎస్‌.రామమునిరెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయన 1982లో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరి 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి విజయం సాధించారు. ఎన్నికైన తొలిసారే ఎన్టీఆర్‌ తొలి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

నాదెండ్ల సంక్షోభం సమయంలో ఆయన గ్రూప్ లో చేరి అక్కడ కూడ మంత్రిగా పనిచేశారు. అనంతరం మారిన రాజకీయపరిణామాల నేపథ్యంలో కొంతకాలం సైలెంట్ అయ్యారు. మళ్ళీ టీడీపీ నుంచి 1999లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. మళ్ళీ ఇప్పుడు తన పాత మిత్రుడు నాదెండ్లతో కలిసి బీజేపీలో చేరారు.