జగన్ కి తలనొప్పిగా మారిన టీటీడీ సభ్యుల నియామకం !

ఏపీలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ ప‌ద‌వి సుబ్బారెడ్డికి కేటాయించ‌టంతో తమని కూడా వెంకన్న బోర్డుకు మెంబర్లు గా అవ‌కాశం ఇవ్వాల‌ని ప‌లువురు పార్టీ నేత‌లు జ‌గ‌న్‌ను అభ్య‌ర్దిస్తున్నారు. ఇప్ప‌టికే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు, బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి పేర్లు జ‌గ‌న్ ఖ‌రారు చేసిన‌ట్లు ప్రచారం జరిగింది. తూర్పు గోదావ‌రి నుండి రౌతు సూర్య‌ప్ర‌కాశరావు లేదా తోట వాణిల్లో ఒక‌రికి అవ‌కాశం ద‌క్కే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది.

ఇక అనంత‌పురం జిల్లా నుండి మ‌హిళా ఎమ్మెల్యేకు అవ‌కాశం ఇవ్వాలని, తెలంగాణ కోటాలో జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావుకి అవకాసం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. అయితే విషయం జగన్ కి తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఒకరికి ఇస్తే మరొకరు అలక పాన్పు ఎక్కే అవకాశం ఉండడంతో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు జగన్.