యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఆగస్టు 15 న తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో ఏక కాలంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం మిగిలి ఉన్న పాటల షూటింగ్ జరుపుకుంటుంది. అందులో భాగంగా రీసెంట్ గా ఆస్ట్రియాలో పాటని పూర్తీ చేసారు.
1368 అడుగుల ఎత్తున్న మంచు కొండలపైకి కేబుల్ కార్లలో వెళ్లి ఈ పాటను పూర్తి చేశారట. బాలీవుడ్కి చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్ వైభవి మర్చంట్ నేతృత్వంలో ప్రభాస్, శ్రద్ధాకపూర్లపై పాటని తెరకెక్కించారు. సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన ఈ పాట సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని చిత్ర యూనిట్ తెలుపగా..తాజాగా తన ట్విట్టర్ లో ఈ పాట కు సంబందించినా విశేషాలను ప్రభాస్ అభిమానులతో పంచుకున్నారు.
ఆస్ట్రియాలోని ఇన్స్ బ్రక్స్, టిరోల్ ప్రాంతంలో షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్ ఓ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది అని ప్రభాస్ ట్వీట్ చేసి దాని తాలూకా ఓ ఫోటోను కూడా షేర్ చేసి ఆకట్టుకున్నారు.
Hi Darlings ! Shooting in Innsbruck and Tirol region of Austria, was one of the most incredibly awesome experiences I have ever had…
– #Prabhas #Saaho pic.twitter.com/XUKST1tX6U— Prabhas (@PrabhasRaju) 2 July 2019