చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రీసెంట్ గా షూటింగ్ అంత పూర్తీ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఓ పక్క ఈ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ గా జరుపుకుంటూ సినిమా ఫై ఎంత క్రేజ్ ఉందొ చెప్పకనే చెపుతున్నారు.
తాజాగా కర్ణాటక హక్కులు రూ.35 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. కర్ణాటకలో తెలుగు సినిమాలకి మంచి ఆదరణ లభిస్తుంటుంది. అందులోనూ చిరంజీవి సినిమా అంటే మరింత క్రేజ్ ఉంటుంది. అక్కడ తెలుగు చిత్రాలు నేరుగా విడుదల అవుతుంటాయి. ఇక సైరా మూవీ లో కన్నడ నటుడు సుదీప్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఇంకాస్త ఆసక్తిగా ఉన్నారు.
బ్రిటిష్ పాలకుల్ని ఎదిరించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, అనుష్క, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్చరణ్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 02 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.