తెరపైకి కెఏ పాల్ బయోపిక్..హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది..సినీ , రాజకీయ , క్రీడా ఇలా పలు రంగాలలో రాణించిన వారి జీవిత కథ ఆధారంగా బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పలువురి బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు రాగా ..తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ జీవిత కథ ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కంచబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కెఏ పాల్ చేసిన హడావుడి ఆంతా ఇంతా కాదు.. ప్రచారం లో ఈయన చేసిన కామెంట్స్ చేసిన చేష్టలు ఇప్పటికే సోషల్ మీడియా లో మంచి కామెడీ ని పంచుతున్నాయి. అందుకే సినిమా వాళ్ళ కన్ను ఆయన మీద పడింది. ఆయన బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నారట ఒక కొత్త దర్శకుడు. ఇందులో పాల్ పాత్రను ప్రముఖ నటుడు సునీల్ చేయనున్నాడని, ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.