టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజు పేరే చెపుతారు. అందుకే అగ్ర హీరోలు సైతం రాజు గారు ఎప్పుడు సినిమా అంటే అప్పుడు డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక రాజు గారికి సినిమాలంటే ఎంత ఇష్టమో..శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న అంతే ఇష్టం. అందుకే ఆయన బ్యానర్ కు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అని పెట్టుకున్నాడు. అలాగే దిల్ రాజు కు ఎప్పటి నుండి ఓ కోరిక ఉంది..అదేంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ఉండాలని…చాలాసార్లు ఆ ప్రయత్నాలు చేసారు కానీ కుదరలేదు.\
ఈసారి మాత్రం రాజు గారి కోరిక తీరేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం వచ్చాక ఏపీలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టీటీడీ ఛైర్మన్ పదవిలో జగన్ బాబాయో వైవీ సుబ్బారెడ్డి నియమితుడయ్యాడు. ఇప్పటికే ఈయన ప్రమాణ స్వీకారం కూడా చేసాడు. దీనికి దిల్ రాజు కూడా వచ్చాడు. అక్కడే చాలా సేపు ఉండి జగన్మోహన్ రెడ్డితో తన కోరిక గురించి మాట్లాడినట్లు తెలుస్తుంది. రాజు కోరిక పట్ల జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు వినికిడి.