సూపర్ స్టార్ రజనీకాంత్ – నయనతార జంటగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీ లో రజనీకాంత్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అందులోఒకటి పోలీసు అధికారి పాత్రకాగా, మరొకటి ఎన్కౌంటర్ స్పెషలిస్టు గా.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్తో పాటు చెన్నై భామ నివేదా థామస్ , మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ దర్భార్ చిత్రంలో నటిస్తుండగా… తాజాగా వీరి జాబితాలో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ చేరినట్లు వినికిడి. విలన్ గ్యాంగ్లో ఒకరిగా ఈయన కనిపించనున్నారని అంటున్నారు. యోగ్ రాజ్ సింగ్ క్రికెటర్గాను, నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వందకి పైగా హిందీ చిత్రాలలో ఆయన నటించారు.
ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.