రోజాకు విజయశాంతి సపోర్ట్..

నగరి నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందిన రోజా కు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఫై జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోజా అభిమానులు. పార్టీ కి వెన్నుగా ఉండి..తెలుగుదేశం ఫై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వైసీపీ కి కావాల్సిన పబ్లిసిటీ ఇచ్చిన రోజా ను పక్కకు పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి సైతం రోజా కు మద్దతు పలికింది.

కొత్తగా ఏర్పాటైన జగన్‌ మంత్రివర్గంలో వైకాపా ఎమ్మెల్యే రోజాకు స్థానం కల్పించకపోవడంపై ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏపీ కేబినెట్‌ కూర్పుపై కూడా నా అభిప్రాయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. మిగిలిన మహిళలకు అవకాశాలు కల్పించడంతో పాటు సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజాకు కూడా జగన్‌ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుంది. రాబోయే రోజుల్లోనైనా జగన్‌.. రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అని విజయశాంతి పేర్కొన్నారు.

ప్రస్తుతం విజయశాంతి 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో ఓ కీలక రోల్ లో ఆమె కనిపించబోతున్నట్లు సమాచారం.