సాహో లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..

ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ డైరెక్షన్లో యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం సాహో. యువీ క్రియేషన్స్ బ్యానర్ ఫై దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెలుగు , హిందీ , తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నా తరుణంలో రోజులు దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ఫై ఆసక్తి పెరుగుతుంది. దానికి తగ్గట్లే చిత్ర విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో సాహో షూటింగ్ జరుగుతోంది. నేటితో టాకీ చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. ఈనెల 9 నుంచి అన్నపూర్ణ లో సాంగ్ షూట్ పూర్తి చేయనున్నారు. ఇండోర్ లో పాట చిత్రీకరణ కోసం ఇప్పటికే భారీ సెట్లు వేశారు. ఈ పాట చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తయినట్టే. ఇక కీలకమైన డబ్బింగ్ సహా డీఐ పనులు చేస్తారు. మరోవైపు గ్రాఫిక్స్ – వీఎఫ్ ఎక్స్- మిక్సింగ్ కి సంబంధించిన పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఓవరాల్ గా చెప్పిన టైం కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రేయిపగలు కష్టపడుతున్నారు.