అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మూవీ లో చిత్రలహరి బ్యూటీ..

అల్లు అర్జు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ – హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. పూజా హగ్దే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా..తాజాగా సెకండ్ హీరోయిన్ ను ఖరారు చేసారు. చిత్రలహరి సినిమాలో నటించిన నివేత పెత్తురాజ్ ను ఫైనల్ చేసారు.

2016లో ‘ఓరు నాల్ కొట్టు’ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రం అంతగా ఆడకపోవడంతో నివేతకు మంచి డెబ్యూ లభించలేదు. ఆ తర్వాత తెలుగులో ‘మెంటల్ మదిలో’ అనే చిత్రంలో నటించిన నివేత మొదటి తెలుగు చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా సాయి తేజ్ హీరోగా నటించిన ‘చిత్రలహరి’ అనే చిత్రంలో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు బన్నీ సరసన జోడి కట్టే ఛాన్స్ దక్కించుకొని వార్తల్లో నిలిచింది. మరి ఈ భామ కు ఈ సినిమా ఎంత కలిసొస్తుందో చూడాలి.