సుశాంత్ సంతోషం మాములుగా లేదు..

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ తర్వాత మరోసారి త్రివిక్రమ్ – బన్నీ కలయికలో సినిమా మొదలు అయ్యింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాలో నాగార్జున మేనల్లుడు సుశాంత్, నవదీప్ లు నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే అధికారిక ప్రకటన రాకపోయేసరికి వీరిద్దరూ నటిస్తున్నారో లేదో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

కాగా ఈరోజు నుండి ఈ చిత్ర సెట్ లో జాయిన్ కాబోతున్నట్లు సుశాంత్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘#AA19 సెట్స్‌లో నా తొలి రోజు! ఈ సినిమా గురించి నేను ఎక్కువగా ఏమీ చెప్పలేను. కానీ, నాకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ‘ఆర్య’ నుంచి ఇప్పటి వరకు తన నటనతో మెప్పిస్తూ వస్తోన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(బన్నీ), పవర్ హౌజ్ టబు గారు, నా ఫ్రెండ్ పూజ, పీఎస్ వినోద్ సర్, తమన్, మిగిలిన అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్‌తో పనిచేయబోతుండటం చాలా ఆనందంగా ఉంది! నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ‘చి ల సౌ’ తరవాత నాకు ఇది మరో కొత్త అడ్వెంచర్. ఇంత అద్భుతమైన టీమ్ నుంచి నేను చాలా నేర్చుకుంటాననే నమ్మకంతో ఉన్నాను’ అని సుశాంత్ ట్వీట్ చేశారు.

గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. ప్రముఖ బాలీవుడ్ నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు.