సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే షాకే..

ప్రభాస్- శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం సాహో. తెలుగు , తమిళ్ , హింది భాషల్లో ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భాంగా చిత్ర ప్రీ రిలీజ్ కు సంబందించిన వార్త అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం .. తెలుగు రాష్ట్రాల్లో రూ.105 నుంచి 115 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా తెలుగు రైట్స్ రూ.150 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు అంటున్నారు. ఇక అన్ని భాషలతో కలుపుకుంటే రూ.300 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్టు చెపుతున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మలేం కానీ ఈ వార్తలు చూసి మాత్రం అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక ఈ నెల 05 న సాహో సరికొత్త టీజర్ విడుదల కాబోతుంది. జస్ట్ ఈ టీజర్ కోసమే చిత్ర నిర్మాతలు 15 లక్షల ఖర్చు చేశారట. మరి ఆ టీజర్ ఎలా ఉండబోతుందో అని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ ఫై వంశీ, ప్రమోద్, విక్కీలు నిర్మిస్తున్నారు. మురళీశర్మ, జాకీ ష్రాఫ్, ఎవ్లీన్‌ శర్మ, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మందిర బేడీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.