రాజ్ నాథ్ సింగ్ కే పట్టం

Rajnath singhబీజేపీ నూతన అధ్యక్షుడిగా రాజ్ నాథ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోసారి గడ్కరీ అధ్యక్షుడిగా నియమితులవుతారనే ప్రచారం జరిగినప్పటికీ అతని పై వచ్చిన అవినీతి ఆరోపణ నేపథ్యంలో..  రాజ్ నాథ్ సింగ్ కు మరోసారి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ… దేశంలో తీవ్రవాదం నిర్మూలించడంలో యూపీఏ సర్కారు ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. వారసత్వ రాజకీయాలు, పదవులు నిలబెట్టుకునేందుకే కాంగ్రెస్ ప్రాధాన్యతనిస్తుందని, ఆ పార్టీనేతలంతా రాహుల్ జపం చేయడంతోనే సరిపోతుందని ఎద్దేవా చేశారు.

దేశంలోని సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే బీజేపీ ధ్యేయమని, ఇదే తమ అంతిమ లక్ష్యమని రాజ్ నాథ్ తెలిపారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవడమే ధ్యేయంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.