అసదుద్దీన్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

Asaduddin-Owaisi (1)ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బెయిల్ పిటిషన్ ని సంగారెడ్డి న్యాయస్థానం తిరస్కరించింది. ఈరోజు ఉదయం ఈ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ఎనిమిదేళ్ల క్రితం నాటి కేసుకు సంబంధించి అసదుద్దీన్ సోమవారం సంగారెడ్డి కోర్టు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఓ ప్రార్థనా మందిరం తొలగింపును అడ్డుకున్నారని 2005లో అసదుద్దీన్ పై కేసు నమోదైంది. ఇదే కేసులో ఆయన సోదరుడు అక్బరుద్దీన్ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.