కేవీపీనే అడ్డు : మధుయాష్కీ

madhu-yashkiఢిల్లీలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో తెలంగాణ ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం మధుయాష్కి మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణను అడ్డుకుంటున్న మొట్టమొదటి వ్యక్తి రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అని మరోసారి మండిపడ్డారు. సీమాంధ్ర నేతల ఢిల్లీ టూర్ వెనుక కూడా కేవీపీ హస్తముందని ఆయన ఆరోపించారు. కేవీపీ వల్లే తెలంగాణ రావడం లేదని, 2009 నుంచి తెలంగాణను అడ్డుకుంటున్నది కేవీపీనే అని.. ఆయవల్లే తెలంగాణలో వందలమంది ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. కేవిపీని నియంత్రిస్తేనే తెలంగాణ సాధ్యమవుతుందని సూచించారు.