ధర్మాన, మోపిదేవిల విచారణకు అనుమతి

dharmana-mopideviమంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలను అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు సిబిఐ కోర్టు అనుమతించింది. ధర్మాన ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న సీబీఐ అభ్యర్థనను సీబీఐ కోర్టు అంగీకరించింది. ఈ నెల 31న కోర్టుకు హాజరు కావాలని వారిద్దరికి కోర్టు సమన్లు జారీ చేసింది. విచారణకు కోర్టు అనుమతించడంతో పెండింగ్ లో ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ముఖ్యమంత్రి అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది.