బాలీవుడ్ పై ఆసక్తి లేదు : మహేష్

mahesh-babu-launches-idea-smartphone-6వరుస హిట్లతో టాలీవుడ్ నెంబర్ వన్‌ హీరో గా దూసుకు పోతున్న మహేష్ బాబు బాలీవుడ్ చిత్రాలపై తనకెలాంటి ఆసక్తి లేదన్నారు. ఐడియా సెల్యులార్ సంస్థ తన తాజా ప్రోడక్ట్ గా ‘ఐవరీ’ పేరుతో 3జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న మహేష్ బాబు లాంఛనంగా ఈ ఫోన్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా చిట్ చాట్ లో మహేష్ మాట్లాడుతూ… బాలీవుడ్ నుంచి ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికీ తానే అంగీకరించడం లేదని చెప్పాడు. తనకు తెలుగంటేనే ఇష్టమనీ, టాలీవుడ్ సినిమాలు మాత్రమే చేస్తానని తెలిపాడు మహేష్. వెంకటేష్ తో కలిసి మహేష్ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పలువురు బాలీవుడ్ దర్శకులు తమ చిత్రాల్లో మహేష్ ని హీరోగా నటింపజేసేందుకు ఇప్పటికే సంప్రదించారు కుడా. అయితే, మహేష్ మాత్రం ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించాడు. ప్రస్తుతం మహేష్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ లో బిజీగా వున్నారు.