కేంద్ర మంత్రివర్గం భేటీ

Cabinet-Meetingప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రివర్గం గురువారం భేటీ అయ్యింది. జార్ఖండ్ లో రాష్ట్రపతి పాలన విధింపుపై ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. భాజాపాకు జేఎంఎం మద్దతు ఉపసంహరణ నేపథ్యంలో జార్ఖండ్ లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. దీంతో ఆ రాష్ర్ట గవర్నర్ సయ్యద్ అహ్మద్ శాసనసభను షుప్త చేతనావస్థలో ఉంచాలని సిఫార్సు చేస్తూ కేంద్రానికి నివేదిక పంపిన విషయం తెలిసిందే. జార్ఖండ్ లో రాష్ర్టపతి పాలన విధింపుపై కేంద్ర కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశముంది.