సీతమ్మకు పైరవీల తాకిడి

Seethamma_Vakitlo_Sirimalle_Chettu reviewఈ సంక్రాంతి సినీ ఇండస్ట్రీకి నిజమైన సిరుల పంట పండించేలా కనిపిస్తోంది. ఓ వైపు నిన్ననే రిలీజైన నాయక్‌ ఇప్పటికే హిట్‌ టాక్‌ సంపాదించుకుని కలెక్షన్‌ వర్షం కురిపిస్తోంది. మరోవైపు రేపు రిలీజ్‌ కాబోతున్న “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా ఇప్పటికే తన సత్తా, స్టామినాను చాటిచెప్తోంది. విక్టరీ వెంకటేశ్‌, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబులు ఒకేసారి తెరపై కనిపించడమే అసలైన సంక్రాంతి అంటున్నారు ఈ హీరోల అభిమానులు. ఈరోజు నిర్వహించబోయే ప్రీమియర్‌ షో టికెట్‌ ధర రూ.5000గా నిర్ణయించినా సరే ఏ మాత్రం వెనకాడకుండా అన్ని టికెట్లను కొనేశారట. మరోవైపు ఆ టికెట్‌ ను బ్లాక్‌ చేస్తే కనీసం 20 లేదా 30వేల వరకైనా సరే ఖర్చు పెట్టదానికి కూడా కొందరు సిద్ధమైనట్టు అనధికార సమాచారం. ఇక రేపు థియేటర్లలో కనిపించబోతున్న సీతమ్మ ను మొట్టమొదటి ఆటలోనే చూడాలని ప్రముఖులు సైతం సిద్ధపడుతున్నారట. ఐ.ఏ.ఎస్‌, ఐ.పీ.ఎస్‌, ప్రభుత్వోద్యోగులు, రాజకీయ నాయకులూ… ఇలా అందరూ ఈ టికెట్ల కోసం ఏకంగా పైరవీలు కూడా చేస్తున్నారని సమాచారం. అతిశయోక్తో కాదో తెలీదు కానీ ఏకంగా ముఖ్యమంత్రి పేషీ నుండి సైతం ఈ సినిమా టికెట్ల కోసం నిర్మాత దిల్‌ రాజుకు ఓ స్ట్రాంగ్‌ రెకమెండేషన్‌ వెళ్ళినట్లు వార్తలొచ్చాయి. ఏదేమైనా ఇవన్నీ చూస్తోంటే “సీతమ్మ వాకిట్లో….” చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టేయడం గ్యారంటీ అనేలా కనిపిస్తోంది….