మల్టీస్టారర్ గా తెరకెక్కబోతున్న భారతీయుడు 2 ..?

కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం ఎలాంటి సంచలన విజయం సాధించిందో తెలియంది కాదు..తమిళ్ , తెలుగు భాషల్లో రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరవాత ఈ సినిమాను సీక్వెల్ తెరకెక్కిందామని అనుకున్నారు కానీ అది కుదరలేదు. మళ్లీ ఇంత కాలానికి దీనికి సీక్వెల్ తెరపైకి వచ్చి అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు సోమవారం పూర్తీ అయ్యాయి.

ఈ సీక్వెల్‌లో కమల్ హాసన్ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈ మూవీని ఇప్పటి సమకాలీన రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కబోతున్నట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ తో పాటు ఈ చిత్రంలో మరో ఇద్దరు యువ హీరోలు కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలో మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ ను ఎంపిక చేయగా , మరో తమిళ స్టార్ హీరో శింబును కూడా కీలక పాత్రకు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు నుండి కూడా ఒక స్టార్ హీరోని ఎంపిక చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు తెలుస్తుంది.

శింబు ఈ చిత్రంలో విలన్ గా కనిపించే అవకాశం ఉందని తమిళ వర్గాల సమాచారం. అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జనవరి నుండి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది. ప్రస్తుతం శంకర్ 2.ఓ చిత్ర ప్రమోషన్ లో బిజీ గా ఉన్నాడు. రజనీకాంత్ – అక్షయ్ కుమార్ నటించిన ఈ మూవీ నవంబర్ 29 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్ ఫై దాదాపు రూ. 500 కోట్ల ఫైచిలుక బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించబడింది.