ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం సోషల్ మీడియా ను నమ్ముకొని ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం చిత్రం తో హీరోగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈయన ఆ తర్వాత పలు క్యారెక్టర్ రోల్స్ లలో సైతం నటించి ప్రేక్షకులను అలరించారు. కేవలం తెరపై మాత్రమే కాదు తెర వెనుక కూడా హీరో అని పలు సందర్భాలలో నిరూపించుకున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తు జరిగి ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరిగిన తన వంతు సాయం ప్రకటిస్తూ రియల్ హీరో అనిపించుకుంటూ వస్తున్నాడు. తాజాగా ‘తిత్లీ’ తుఫాన్తో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాకు తన వంతు సాయం చేసి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ముఖ్యమంత్రి సహాయనిధికి తనవంతుగా రూ.50 వేలు అందిస్తానని ప్రకటించారు.
‘శ్రీకాకుళం జిల్లాకు తిత్లీ తుఫాన్ వల్ల చాలా నష్టం జరిగిందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. వెంటనే మన వంతు సాయంగా చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నా. నా వంతుగా రూ.50వేలు ముఖ్యమంత్రి గారి సహాయనిధికి అందజేస్తాను’ అని ట్వీటర్లో సంపూర్ణేష్బాబు పోస్ట్ చేశారు. శ్రీకాకుళానికి టాలీవుడ్ నుంచి ఆర్థిక సహాయం ప్రకటించిన మొదటి నటుడు సంపూర్ణేష్బాబే కావడం గ్రేట్. సంపూ ను చూసైనా మరికొంతమంది సాయం చేసేందుకు ముందుకు రావాలని కోరుకుందాం.
ప్రస్తుతం సంపూ కొబ్బరి మట్ట అనే సినిమా తో నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రోనాల్డ్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొబ్బరి మట్ట’ సినిమాలో పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు
అన్న మూడు పాత్రలతో సంపూర్ణేష్ సందడి చేయనున్నారు.
శ్రీకాకుళం జిల్లా #CycloneTitli వల్ల చాలా నష్టం జరిగింది అని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను…..వెంటనే మన వంతు సాయంగా చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటున్నాను
నా వంతుగా Rs.50,000/- ఆర్థిక సాయం ముఖ్యమంత్రి గారి సహాయనిధి కి అందజేస్తాను#SaveSrikakulam pic.twitter.com/hGwpgGTeZI
— Sampoornesh Babu (@sampoornesh) 13 October 2018