ప్రభాస్ ప్రస్తుతం సాహో తో పాటు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20 వ సినిమా చేస్తున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపు 40 % పూర్తి అయ్యిందని సమాచారం. ఇక ఈ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చి , తన 20 సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు.
సెప్టెంబర్ 20 నుండి ఈ చిత్ర షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. 24న ప్రభాస్ టీంతో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. తాజాగా ప్రభాస్ ఇటలీ స్థానిక అధికారులతో కలిసి ఫోటోలకి ఫోజులిచ్చాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీసాలు లేకుండా సరికొత్త లుక్లో కనిపిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారుతుంది. గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమకథ నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీగా తెరకెక్కుతుండగా ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.