అక్బరుద్దీన్ పై రెండు కేసులు నమోదు : డీజీపీ

denesh-reddyఆదిలాబాద్ జిల్లా నిర్మల్ బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై రెండు కేసులు నమోదు చేశామని డీజీపీ దినేష్ రెడ్డి వెల్లడించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ శిక్షాస్మృతి 121, 153(ఏ) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. సమన్లు ఇచ్చేందుకు ఓవైసీ నివాసానికి వెళ్ళగా అక్బరుద్దీన్ ఓవైసీ లండన్ లో ఉన్నారని తేలిందన్నారు. ఆయన నిర్మల్ బహిరంగ సభలో చేసిన ప్రసంగాన్ని ఉర్దూలో నుంచి తెలుగులోకి తర్జుమా చేసిన తర్వాత అభియోగాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ను అరెస్టు చేసేందుకు అవసరమైతే ఇంటర్పోల్ సహాయం తీసుకుంటామని డీజీపీ చెప్పారు.