శాస్ర్త, సాంకేతిక రంగానిది దేశాభివృద్ధిలో కీలక పాత్ర : ప్రధాని

Manmohanభారత వైజ్ఞానిక సదస్సు ఈ రోజు కోల్ కతలో ప్రారంభమైనంది. ఈ కార్యక్రమాన్ని రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ… దేశ అభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక రంగానిదే కీలకపాత్ర అని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ధనికులు, పేదల మధ్య అంతరాన్ని తొలగించేందుకు శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి తోడ్పడుతుందన్నారు. విజ్ఞాన శాస్త్రాన్ని ప్రచారం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.