7న ‘ఏప్రిల్ పూల్’ ఆడియో

april-poolఏప్రిల్ పూల్ సరదా సంఘటనలను కథావస్తువుగా ఎంచుకుని ‘ఏప్రిల్ పూల్’ చిత్రాన్ని మలిచామని దర్శకుడు కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగర్ తెలిపారు. జగపతిబాబు, భూమిక, రణధీర్, సృష్టి, గుల్షన్ గ్రోవర్ ప్రధాన పాత్రధారులుగా సుధా ఎంటర్ టైనర్ టైన్ మెంట్, కర్తాళ్ ప్రొడక్షన్స్ పతాకంపై జి.ఎల్. శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..’అబ్బాయి అంటే ఎలా ఉండాలన్న దానికి నిర్వచనం జగపతిబాబు అయితే, అమ్మాయికి ఆదర్శంగా భూమిక పాత్రలుంటాయి. ఇక ఏప్రిల్ పూల్ రోజునే పుట్టిన కథానాయకుడు రణధీర్ తనకేం జరిగినా దానికి భగవంతుడ్ని నిందించే స్వభావం కలిగిన పాత్రలో కనిపిస్తే, జరిగేవన్నీ యాధృశ్చికం కావడం కథానాయిక సృష్టి పాత్రలో కనిపిస్తాయి. వీరితో పాటు గుల్షన్ గ్రోవర్ తమ తమ పాత్రలలో నటించారనడం కంటే జీవించారని చెప్పవచ్చు. తాగుబోతు రమేష్, ధనరాజ్ తమ పాత్రల ద్వారా ప్రేక్షకులను కడుబుబ్బ నవ్విస్తారు’ అని చెప్పారు.

నిర్మాత జి.ఎల్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనవరి 7న ఆడియోను, అదేనెల 25న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : తనికెళ్ళ రాజేంద్రప్రసాద్, సంగీతం : డా. బంటి, దర్శకత్వం : కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగర్.