జగన్ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

sivaprasad-reddy-darshi-mlaప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. దర్శి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సొంతపార్టీకి షాక్ ఇచ్చారు. ‘జగన్ కోసం జనం’ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ రోజు ఒంగోలులో వైకాపా పార్టీ శ్రేణులు ఘనంగా ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన తల్లి వెంకాయమ్మతో కలిసి ఈ పాల్గొన్నారు. అనంతరం ఆయన బాలినేనికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి కొద్దిసేపు రహస్యంగా మాట్లాడినట్టు సమాచారం. ఈ పరిణామంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది.