మెగాస్టార్ చిరంజీవి – నయనతార జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా – నరసింహ రెడ్డి’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వేసిన ఓ భారీ సెట్టింగ్ లో శర వేగంగా జరుపుకుంటుంది. ఈ ఒక్క షెడ్యూల్ కోసమే చరణ్ రూ. 40 కోట్ల ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 40 రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించిన ముఖ్య మైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.
ఇదిలా ఉంటె ఈ చిత్రాన్ని 2019 మార్చి నెలలో విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారట. దీనికి కారణం చరణ్ రంగస్థలం అని తెలుస్తుంది. మార్చి నెలలో విడుదలైన రంగస్థలం ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో..ఎన్ని రికార్డ్స్ కొల్లగొట్టింది తెలియంది కాదు. అందుకే చిరు కూడా రంగస్థలం సెంటిమెంట్ ను నమ్ముతున్నాడట. మార్చి లో రిలీజ్ చేస్తే సినిమాకు బాగా కలిసి వస్తుందని చరణ్ తో చెప్పడం జరిగిందట. ఇప్పటికే 40 % షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. డిసెంబర్ కల్లా సినిమా అంత పూర్తి చేసి , పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.
భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ లో యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా ఉండబోతున్నాయి. ఈ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ను తీసుకోవడం జరిగింది. స్కైఫాల్, హ్యారీపొటర్ సిరీస్లకు యాక్షన్ డైరెక్టర్గా పనిచేసిన గ్రెగ్ పావెల్ సైరా సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.