రాష్ర్టం సమైక్యంగానే ఉండాలి : బొత్స

Botsa-Satyanarayanaవ్యక్తిగతంగా అయితే రాష్ర్టం విడిపోవాలని కోరుకోవట్లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు (బుధవారం) తెలంగాణ డీసీసీ అధ్యక్షులతో బొత్స సమావేశమయ్యారు. తెలంగాణ విషయంలో పార్టీ విధానానిని కట్టుబడి ఉండాలని వారికి సూచించారు. దీనికి స్పందించిన తెలంగాణ డీసీసీ అధ్యక్షుడు బొత్స వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. గతంలో ‘తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ర్టాలుంటే తప్పేంటి’ అని బొత్స చేసిన మాటలను తెలంగాణ డీసీసీలు ఈ సందర్భంగా ఆయనకు గుర్తుచేసినట్లు సమాచారం. దీనిపై బొత్స స్పందిస్తూ.. నేను ఆ మాటలు అన్నది నిజమేనని కానీ, రాష్ర్టం సమైక్యంగా ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం అన్నట్లు సమాచారం. ఈ మాటలతో డీసీసీలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది.