సూరీడు, రిపుంజయరెడ్డి నివాసాల్లో ఏసీబీ దాడులు

suridu-rimpujayareddy Each APPSC member made Rs.50 crore eachదివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సూరీడు, గతంలో వైఎస్ పీఏగా పనిచేసి ప్రస్తుతం ఏపీపీఎస్సీ సభ్యునిగా ఉన్న రిపుంజయ్రెడ్డి నివాసాల్లో ఈరోజు (బుధవారం) ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వీరిద్దరూ కలిసి ఆదాయానికి మంచి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి సమాచారం అందటంతో నాలుగు బృందాలుగా అధికారులు ఏకకాలంలో ఇరువురి ఇళ్లలో దాడులు జరిపారు.

జూబ్లీహిల్స్, గాయత్రినగర్లోని సూరీడు నివాసంలో సోదాలు జరిపిన అధికారులు పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే యూసుఫ్ గూడా, వెంకటగిరిలోని రిపుంజయరెడ్డి ఇంట్లోనూ ఏసీబీ దాడులు జరుపుతోంది. భారీగా నగదు, విలువైన పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క యూసుఫ్గూడాలోనే రిపుంజయరెడ్డికి ఆరు ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ దాడుల్లో బయటపడింది.