హైకోర్టులో జగన్ కు మరోసారి భంగపాటు

jagan-bail-petitionహైకోర్టులో జగన్ కు మరోసారి భంగపాటు తప్పలేదు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టాట్యుటరీ బెయిల్ ను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ చేసిన వాదనలతో ఏకీభవిస్తూ జగన్ బెయిల్ పిటిషన్ విచారణార్హం కాదంటూ హైకోర్టు కొట్టివేసింది. కాగా కేసు మెరిట్స్ జోలికి పోవటం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు మధ్యాహ్నం జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.