బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి నుండి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి..ఎన్నో తిప్పల తర్వాత మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకున్న, సెకండ్ షెడ్యూల్ జరుపుకోవడానికి మాత్రం చాలానే ఇబ్బందులు పడింది. ఎట్టకేలకు రెండో షెడ్యూల్ దుబాయి లో ఈ మధ్యనే మొదలయ్యింది.
ఈ షెడ్యూల్లో కొన్ని రిస్కీ స్టంట్స్ ఉంటాయని మొదటినుండి ప్రచారం అవుతూనే ఉన్నాయి. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ రూపొందిస్తున్నట్టు సమాచారం. బుర్జ్ కల్ఫియా, రాస్ అల్ కైమా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాంతాలలో ప్రభాస్పై చేజింగ్ సీన్స్ తీస్తున్నారు. దానికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ స్టైలిష్ లుక్లో బైక్ మీద కూర్చున్న స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు బయటకి రాకపోవడంతో లీకైన ఫోటోస్లో ప్రభాస్ని చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఫై తెరకెక్కుతున్న ఈ మూవీ లో ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.