పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఇప్పుడు ఓ హాట్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఐటెంగాళ్ గా బాలీవుడ్ నటి దీపిక పదుకునె కనువిందు చేయనుందట. ఇందుకోసం చిత్ర నిర్మాత ఆమెను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఐటంసాంగ్ కంటే సెకండ్ హీరోయిన్గా మారిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా త్రివిక్రమ్లో మెదిలింది. ఈ విషయమై త్వరలో ప్రకటన రానుంది. ఈ చిత్రం కోసం యూరప్ వెళ్ళి పలు లొకేషన్లను పవన్, త్రివిక్రమ్ చూస్తున్నారు. దేవిశ్రీ కూడా ట్యూన్స్ పనిలో ఉన్నాడు. సమంత హీరోయిన్గా నటిస్తోంది. జనవరి నుంచి రెగ్యులర్ షూట్ చేయనున్నారు.