మహేష్ ను పక్కకు పెట్టిన ఏపీ..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త కలెక్షన్స్ వసూళ్లు చేస్తూ మహేష్ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ గా నిలవబోతుంది. అయితే ఈ చిత్రాన్ని ఏపీ రాజకీయనాయకులు పక్కన పెట్టినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ చిత్రాన్ని చూసి సినిమా చాల బాగుందని చెప్పడమే కాదు , ఓ ప్రెస్ మీట్ పెట్టి డైరెక్టర్ కొరటాల శివ ను , అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ను ఆకాశానికి ఎత్తారు. దీంతో ఈ సినిమా చూడాలనే ఆత్రుత రాజకీయ వర్గాల్లో కూడా ఎక్కువయింది.

అయితే ఆంధ్రప్రదేశ్ నాయకులు మాత్రం ఈ చిత్రాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఎక్కడ కూడా దీని ఊసు ఎట్టకపోయేసరికి మహేష్ అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మాణం లో తెరకెక్కిన ఈ మూవీ లో మహేష్ కు జోడిగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటించగా , దేవి శ్రీ సంగీతం అందించారు.