తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిన బాహుబలి, తాజాగా చైనా లోను సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు చైనాలో ఏ భారతీయ చిత్రం కూడ ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలకాలేదు. అలాంటిది ‘బాహుబలి-2’ మాత్రం మే 4న భారీ ఎత్తున ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ బాహుబలి 2 అన్ని భాషల్లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణ, రానా, సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ ఈ చిత్రం దాదాపు 1800 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించబోతున్నాడు. 2019 లో ఈ మూవీ సెట్స్ పైకి రానుంది.