వేదిక ఫై కన్నీరు పెట్టుకున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను ‘ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని , సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లలో రన్ అవుతుంది. విడుదలైన అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్స్ వస్తుండడం తో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు.

‘భరత్ అనే నేను’ చిత్రానికి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు నా అభిమానులకు, క్రిష్ణగారి అభిమానులకు, మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విషయం నేనెప్పుడూ ఎవరికీ చెప్పలేదు. లాస్ట్ టు ఇయర్స్ నుండి ఎమోషనల్‌గా చాలా ఒత్తిడికి గురయ్యా.. కాని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. పెద్ద రిలీఫ్ దొరికింది. చాలా ఆనందంగా ఉంది.

ఈ చిత్రంలో నాకు జోడీగా నటించిన కైరా అద్వానీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి హీరోయిన్ దొరకడం చాలా ఆనందంగా ఉంది. ఇక దర్శకుడు కొరటాల శివ గురించి చెప్పాలంటే.. శ్రీమంతుడు చిత్రానికి ముందు కూడా నాకు ఇలాంటి పరిస్థితే ఉంది. చాలా ఒత్తిడిలో ఉన్నా.. ఆ టైంలో నాకు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. మళ్లీ అదే రిపీట్ చేసి నేను పడుతున్న టెన్షన్ అర్థం చేసుకుని నాకు మళ్లీ ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చారు అంటూ మహేష్ తెలిపారు.

ఈ సక్సెస్ మీట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు హీరోయిన్ కైరా అద్వానీ, దర్శకుడు కొరటాల, బ్రహ్మాజీ, దేవి శ్రీ ప్రసాద్, నిర్మాత దానయ్య తదితరులు పాల్గొన్నారు.