కత్తి మహేష్ కు శిక్ష పడేవరకు పోరాటం చేస్తాం – శ్రీ రెడ్డి

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఫై నటి శ్రీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత తనను కత్తి మహేష్ బలవంతం చేసాడని ఓ టీవీ ఛానల్ కార్య క్రమం లో చెప్పడం తో మహేష్ అసలు స్వరూపం బయటపడింది. దీంతో శ్రీ రెడ్డి తన ట్విట్టర్ లో మహేష్ కు శిక్ష పడేవరకు పోరాటం చేస్తానని తెలిపింది.

” న్యూస్ చానల్స్ కి వచ్చి డిబేట్స్ లో కూర్చుని నీతులు చెప్పటం కాదు కత్తి మహేష్ ఛి సిగ్గువుండాలి, మా ఉద్యమంలో ఆడవారికి అన్యాయం చేసిన ఎవరైనాసరే వారికి శిక్ష పడేవరకు మేం పోరాడుతూనే ఉంటాం, ఇప్పుడు నువ్వు చేసిన పనికిమాలిన పనికి నువ్వే రివ్యూ చెప్పుకో ఛీ” అంటూ శ్రీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోపక్క మహేష్ మాత్రం నేను అలాంటి పని చేయలేదని , సునీత ఫై పరువు నష్టం దావా వేస్తానని , సరైన ఆధారాలు చూపిస్తే నేను దేనికైనా సిద్ధం అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.