షర్మిల నా చెల్లలు లాంటిది : దానం

danam-nagenderరాష్ర్ట మంత్రి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిగవంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పటికీ తమ గుండెల్లో ఉంటారని, ఎవరెన్నీ చెప్పినా ఆయనపై ప్రేమాభిమానాలు ఉంటాయని కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ చెప్పారు. ఆయన శుక్రవారం తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ.. షర్మిల నాకు చెల్లలు లాంటిది. ఆమె త్వరగా కోలుకోవాలి, తండ్రిని మించిన తనయ కావాలని భగవంతుడిని కోరుకుంటున్నా. మోకాలి గాయంతో బాధపడుతున్న షర్మిలను ఇంటికి వెళ్లి పలకరిస్తాను అని తెలిపారు.

దీంతో దానం వైస్ నాయకత్వంలోని వైఎస్ ఆర్సీ పార్టీ వైపునకు మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లో మజ్లీస్ తో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పొత్తు కారణంగా సులభంగా విజయం సాధించారు. ఎన్నికలు సమీపించిన సమయంలో పరిస్థితిని బట్టి వైఎస్ ఆర్సీ కాంగ్రెస్ పార్టీలో చేరాలా, చేరకుండా ఉండటమా అనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా దానం నాగేందర్ ముందుచూపుతోనే ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.