సీఎం గారూ! వైఖరి మార్చండి : డీఎల్

DL-Kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి మండిపడ్డారు. ధర్మాన ప్రసాద రావు ప్రాసిక్యూషన్ వ్యవహారంపై మంత్రివర్గంలో తీర్మానం చేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో ముఖ్యమంత్రి ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలని హితవు పలికారు. ధర్మాన వ్యవహారాన్ని అధిష్టానం నేరుగా పరిశీలిస్తుందని తెలిపారు. తాను ప్రశ్నించిన న్యాయపరమైన అంశాలను ఈ వ్యవహారంలో గవర్నర్ లేవనెత్తారని డీల్ తెలిపారు. ధర్మాన ప్రసాద రావు ప్రాసిక్యూషన్ ఫైల్ ను గవర్నర్ ప్రభుత్వానికి తిప్పి పంపిన విషయం తెలిసిందే.