‘కృష్ణార్జున యుద్ధం’ సెన్సార్ రిపోర్ట్..

నాని – మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. అనుపమ పరమేశ్వరన్‌, రుక్సర్‌ మీర్‌ హీరోయిన్లు గా నటించారు. ఏప్రిల్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్బంగా ఈ మూవీ సెన్సార్ కార్య క్రమాలు ఈరోజు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని..ఈ మూవీ తో అదే రిపీట్ చేస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని రెండు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలను తెరకెక్కించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ,
వెంకట్ బోయనపల్లి సినిమా ను నిర్మించారు. హిప్‌హాప్ తమిజా సంగీతం అందించాడు.