రంగస్థలంకు పట్టిన పైరసీ భూతం

పైరసీ భూతం సినీ పరిశ్రమను వెంటాడుతోంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా పైరసీని ఆపడం సాధ్యపడటం లేదు. ఎంత అప్రమత్తంగా వుంటున్నా ఏదో మార్గంలో పైరసీ పట్టిపీడిస్తుంది. తాజాగా రామ్‌చరణ్‌ హీరోగా నటించిన రంగస్థలం సినిమా పైరసీ బారిన పడింది.

రంగస్థలం సినిమా పైరసీ జరుగుతుందన్న సమాచారంతో టూటౌన్‌ పోలీసులు ఆర్‌ఆర్‌పేటలోని సంగీత్‌సాగర్‌ సీడీ దుకాణంలో ఆదివారం రాత్రి తనిఖీ చేశారు.పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి అక్రమంగా అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. సినిమా ప్రదర్శితమవుతున్న సత్యనారాయణ థియేటర్‌ మేనేజర్‌ రాము, మెగా ఫ్యాన్స్‌ అభిమాన సంఘ నాయకులు హరికృష్ణ, వీరబాబు తదితరులు సీడీ షాపు వద్దకు వచ్చి తొలుత పరిశీలించారు. పైరసీ జరుగుతుందని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైడ్ జరిగింది.