శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నీదీ నాదీ ఒకే కథ’. వేణు వూడుగుల దర్శకత్వం వహించారు ఈ నెల 23న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఇప్పుడు ఈ దర్శకుడు ఓ లేడీ ఓరియెంటెడ్ కథతో సిద్ధమయ్యాడని తెలుస్తోంది. సాయి పల్లవిని దృష్టిలో ఉంచుకుని ఓ కథ సిద్ధం చేశాడట వేణు. ఈ కథకు సాయి పల్లవి ఫిదా అయిపోతే.. ఈ దర్శకుడి లైన్ క్లియర్ అయిపోయినట్టే. ఈ కధను సాయి పల్లవి తప్పకుండా ఓకే చెబుతుందనే నమ్మకంగా వున్నాడు దర్శకుడు.
ప్రస్తుతం సాయి పల్లవి నటించిన ‘కణం’ త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే ఈ కధను చెప్పబోతున్నాడు వేణు వూడుగుల.