దసరా బరిలో ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకం గా రూపుదిద్దుకోబోతోంది. చిత్రానికి పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసారు.

ఈ సినిమా రిలీజ్ టైం ని కూడా ఫిక్స్ చేశారు. సాధ్యమైనంత వేగంగా చిత్రీకరణ పూర్తి చేయాలని వీరిద్దరూ భావిస్తున్నట్లు సమాచారం. ఒకటి లేదా రెండు షెడ్యూళ్లలోనే చిత్రీకరణ పూర్తి చేయాలని పక్కా ప్లానింగ్‌ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది ఎలాగైనా దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పట్టుదలగా ఉన్నారని సమాచారం. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్.