భరత్ ఫస్ట్ సాంగ్ టాక్ ..

మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రానికి సంబదించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. టైటిల్ కు తగట్టే ఈ సాంగ్ ఉంది. ‘విరచిస్తా నేడే నవశకం-నినదిస్తా నిత్యం జనహితం” అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయడం జరిగింది. లిరిక్స్ కు తగట్టు దేవి శ్రీ ప్రసాద్ రిధం సమకూర్చాడు. ఓవరాల్ గా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన దానికి తగట్టు సాంగ్ ఉంది.


ఇప్పటికే దేవి శ్రీ అందించిన రంగస్థలం ఆడియో మార్కెట్ లో దుమ్ములేపుతుంటే , ఇప్పుడు భరత్ కూడా వాటికీ తగట్టే ఉంబోతున్నాయని ఈ సాంగ్ తో అర్ధం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫస్ట్ సాంగ్ ను మీరు వినండి.