శ్రీలంకలో జరిగిన ముక్కోణపు టీ 20 సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్తో చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 167పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుచుకుంది.
వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ 29నాటౌట్ (8బంతుల్లో) అద్భుతమైన పోరాట పటిమతో భారత్కు విజయాన్ని అందించాడు. భారత్ చివరి మూడు ఓవర్లలో 34 పరుగులు కావాల్సిన సమయంలో బ్యాటింగ్కు వచ్చిన దినేశ్ కార్తీక్ చెలరేగి ఆడాడు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ 56, అర్ధశతకంతో చెలరేగగా, చివరలో దినేశ్ కార్తీక్ దగ్గరుండి భారత్ను గెలపించాడు. బంగ్లా బౌలర్లలో రుబేల్ రెండు వికెట్లు తీశాడు.