టాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ మొదలైయింది. ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీపార్వతి బయోపిక్, సావిత్రి బయోపిక్ లు తెరకేక్కుతున్నాయి. ఇప్పుడు మరో బయోపిక్ కు రంగం సిద్దమైయింది. దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ఇది ‘ఆనందో బ్రహ్మ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి. రాఘవ్ వైఎస్సార్ బయోపిక్ తెరకెక్కించనున్నారు .
కాగా ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం మమ్ముట్టిని .. ఆయన సరసన నయనతారను ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో కొత్త వార్త. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ పాత్రను ఎవరు పోషిస్తారన్న దానిపై చాలాకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఆ పాత్ర కోసం తమిళ హీరో సూర్యను సంప్రదించినట్లు తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. జగన్కి చెందిన భారతీ సిమెంట్స్ కంపెనీకి సూర్య అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడమే కాక జగన్ పాదయాత్ర హిట్ అవ్వాలంటూ సూర్య ఇటీవల శుభాకాంక్షలు తెలపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పాత్రను సూర్య పోషించవచ్చనే వార్తలు నమ్మబుల్ గా వుంది.