ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస మైదానంలో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. బ్యాట్స్మన్లు రోహిత్ శర్మ(89 నాటౌట్), శిఖర్ ధావన్(35), సురేశ్ రైనా(47)పరుగులతో రాణించారు.
దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తడబడుతున్న రోహిత్.. ఈ ముక్కోణపు సిరీస్లో సైతం దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఐతే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మెరిశాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మంచి శుభారంబాన్ని అందించారు. రోహిత్ నెమ్మదిగా ఆది తర్వాత జోరు పెంచాడు. దింతో 20 ఓవర్లలో భారత్ 2 వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది