ప్రకాష్ రాజ్ కి రాజ్యసభ సీటు

ప్రకాష్‌రాజ్ సినిమాల్లో కంటే రాజకీయ వ్యాఖ్యాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ని ఏకి పారేస్తున్నారు అందుకే అన్ని ప్రధాన పార్టీలు ఆయనపై కన్నేశాయి. ఇటీవల ఆయన బెంగళూరులో ప్రధాని మోదీ ర్యాలీపై సెటైర్లు వేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి ఆయన మీద పడేట్లు చేసినట్టు సమాచారం. ప్ఈ మేరకు ప్రకాష్ రాజ్‌ను అభిమానించే కొంతమంది సాహితీవేత్తలు, కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వద్ద ఓ కీలక ప్రాతిపాదన తీసుకొచ్చారు.

ప్రకాష్‌రాజ్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ టికెట్ ఇవ్వాలని ఆయన్ను కోరారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, ప్రకాష్ రాజ్ వామపక్షాలకు దగ్గరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సీటు పొందేందుకు అంగీకరిస్తారా లేదా అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.