శ్రీదేవి డెత్ పై విదేశాంగ శాఖ క్లారిటీ


శ్రీదేవి మృతి కేసు ఊహించని మలుపులు తిరుగిన సంగతి తెలిసిందే. తొలుత గుండెపోటుతో ఆమె చనిపోయారన్న వైద్యులు తర్వాత ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్లు తెలిపారు. చివరికి కేసు కూడా ఇలానే క్లోజ్ చేశారు. దీనిపై మీడియా పెద్ద ఎత్తున కధనాలు వచ్చాయి.

కాగా శ్రీదేవి మరణం వెనుక మరేదైనా కోణం ఉందా? అనే సందేహాలకు భారత విదేశాంగ శాఖ ఫుల్ స్టాప్ పెట్టింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ.. తనకు తెలిసినంత వరకు యూఏఈ ప్రభుత్వం నుంచి మనకు పూర్తి స్థాయి నివేదిక అందిందని చెప్పారు. ఒకవేళ శ్రీదేవి మృతి వెనుక అనుమానించదగ్గ అంశాలు ఏమైనా ఉంటే ఇప్పటికల్లా బయటకు వచ్చేవని చెప్పారు. ఇక ఈ విషయంపై ఎలాంటి చర్చ అవసరం లేదని తేల్చారు.