ఏపీ బిజెపి మంత్రులు రాజీనామా

రాష్ట్ర బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రిని కలిసిన మంత్రులు కామినేని, మాణిక్యాలరావు తమ రాజీనామా లేఖలను అందజేశారు. ఈరోజు ఉదయం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన ఇరువురు రాజీనామా లేఖలను ఆయనకు అందజేశారు.

కేంద్రంలో రాష్ట్రంలో మంచి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఇలా జరగటం బాధాకరంగా ఉందని, ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రతి తెలుగువారూ ఆవేదనతో వున్నారని, అయినప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈ లేఖలో వివరించారు.

కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో రాష్ట్రంలోని బీజేపీ మంత్రులు రాజీనామా చేయాల్సిందిగా అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.