ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సభ ముందు ఉంచుతారు. ఈ నేపధ్యంలో 2018-19 బడ్జెట్కు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఉదయం జరిగిన సమావేశానికి బిజెపి మంత్రులు దూరంగా ఉన్నారు. గురువారం ఉదయం 11.30గంటలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ మొత్తం రూ.1,96,800కోట్లుగా ఉండనుంది. మరోపక్క, భాజపా మంత్రులు అసెంబ్లీలో రాజీనామాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నిన్న కేంద్ర క్యాబినెట్ నుండి టీడీపీ మంత్రులు తప్పుకుంటారని టీడీపీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.